Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి నియోజకవర్గనికి తాగునీరు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించండి: మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.

హైదరాబాద్ : ఈ రోజు ఖైరతాబాద్ లోని జలమండలి HMWS SB – MD సుదర్శన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజిగిరి నియోజకవర్గం సంబంధించిన డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.

ఇటీవల ఎమ్మెల్యే గారు వివిధ కాలనీలలో పర్యటించి తన దృష్టికి వచ్చిన డ్రైనేజీ , త్రాగునీరు సమస్యలను జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డి గారికి క్లుప్తంగా వివరించి సమస్యలను తెలియజేశారు.

* మల్కాజ్గిరి డివిజన్లోని ,శ్రీ సాయినాథ్ రెసిడెన్సి మీర్జాల్ గూడా, కృపానంద అపార్ట్మెంట్స్ , ఆనంద్ బాగ్ , మంజు శంకర్ అపార్ట్మెంట్, ప్రశాంత్ నగర్ పురాతన అపార్ట్మెంట్ వాసులకు త్రాగునీరు కనెక్షన్ ఇవ్వాలని

* మౌలాలి హనుమాన్ నగర్, జెటిఎస్ ప్లే గ్రౌండ్ సమీపంలో సేవరేజ్ పైప్ లైన్ వేయాలని, అక్కడ పైపులైన్ కొరకు రైల్వే స్థలానికి సంబంధించిన స్థల సేకరణ రైల్వే స్థలమునకు నిధులు కేటాయించా లని,

* మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కి సేవరేజ్ పైప్ లైన్ లేనప్పుడు ఎన్వోసీ ఇవ్వకూడదని

* డ్రైనేజి త్రాగునీరుకు సంబంధించిన నూతన ప్రతిపాదనలను అందజేశారు

* బండ చెరువు ఎస్టిపి కి సంబంధించిన డిపిఆర్ ను ఇవ్వాలని మరియు అక్కడ ఎస్టిపి ప్లాంటు పరిసరాలలో డిసిల్టింగ్ చేయించాలని

* జే ఎల్ ఎన్ ఎస్ నగర్ రిజర్వాయర్ కు నిధులు కేటాయించాలని
వినతి పత్రాలు అందజేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో జలమండలి అధికారులు ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ , బిఆర్ఎస్ నాయకులు అనీల్ కిషోర్, రాము యాదవ్, జీ. కే.. హనుమంత్ రావు, ఢిల్లీ పరమేశ్, చిన్నా యాదవ్, ఇబ్రహీం, వివిధ కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News