Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మచ్చ బొల్లారం డివిజన్: ఈరోజు మచ్చ బొల్లారం డివిజన్లో విస్తృతంగా పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి

మచ్చ బొల్లారం డివిజన్: ఈరోజు మచ్చ బొల్లారం డివిజన్లోని జేఏసీ కాలనీ శ్రీ సాయి సూర్య ఎన్క్లవ్ ఫేస్ 1, 2 కాలనీ , మురళీకృష్ణ కాలనీ, న్యూ ద్వారకాపురి కాలనీ , ఎంఈఎస్ కాలనీ , కాశిపురం కాలనీ, శ్రీనివాసిక కాలనీ, గ్రీన్లాండ్ ఎంక్లవ్, శాన్వి హోమ్స్ ,కాలనీలలో జేఏసీ కాలనీ అధ్యక్షుడు మన్మధ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కాలనీ అధ్యక్షులతో విస్తృతంగా పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

మురళి కృష్ణ ఎన్క్లేవ్ లో త్రాగునీరు నీటి కుళాయి ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారు.

అల్వాల్ జెఎసి కాలనీలలో ముఖ్యంగా డ్రైనేజీ, త్రాగునీరు, సిసి రోడ్లు వీధిదీపాలు, విద్యుత్ స్తంభాలు ,సీసీ కెమెరాలు ఏర్పాటు, పార్కుల అభివృద్ధి బస్ షెల్టర్ నిర్మాణం, రిక్వెస్ట్ బస్ స్టాప్ సమస్యల పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి దృష్టికి స్థానికులు వినతి పత్రాలు ద్వారా తీసుకువచ్చారు. ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి స్థానికులు తెలిపే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జలమండలి డీజిఎం సాంబయ్య, మేనేజర్ రమేష్,ఇంజనీరింగ్ అధికారులు రంజిత్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్లు అఫ్రోజ్, హరి, విగ్నేష్ బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ,ఢిల్లీ పరమేష్, ప్రశాంత్ రెడ్డి ,నవీన్ రెడ్డి, వైఎన్ రాజు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

 

Gallery

Latest News